TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:28 am Posted by : TELUGU JYOTHI DESK

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు.

విఐపి బిగినింగ్ సమయంలో ప్రత్యేక దర్శనం

హైదరాబాద్,ఆగస్టు 19( తెలుగు జ్యోతి) ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం వీఐపీ బిగినింగ్ బ్రేక్ దర్శనంలో బిఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ సీనియర్ నాయకులు పాండల శివకుమార్ గౌడ్ దంపతులు,నాగారం సినియర్ నాయకులు గూడురు మహేష్ గౌడ్ దంపతులు,జనగామ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనములు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.