TELUGU JYOTHI
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 9:05 am Posted by : TELUGU JYOTHI DESK

ప్రజల కోసం రామ ప్రభు ముందడుగు దెబ్బతిన్న రోడ్ల కి స్వంత నిధులతో మరమ్మత్తులు..

తెలుగుజ్యోతి
మియాపూర్ :

సమస్య కనిపిస్తే వెనక్కి తగ్గరూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోరూ పరిష్కారం కోసం ముందుండి పోరాడే నాయకత్వమే రామప్రభు ప్రత్యేకత ఎఫ్ సి ఐ కాలని, టి ఎన్ నగర్ , వీడియ కాలని ప్రాంతాల్లో పర్యటించిన అట్టేపల్లి రామప్రభు , అక్కడి రోడ్ల దుస్థితిని స్వయంగా పరిశీలించారు. రోడ్లు సరిగా లేక కాలనీ ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితి ఉండటాన్ని గుర్తించారు.ప్రజల సమస్యను చూసి కేవలం హామీ ఇచ్చి వెళ్లిపోవడం రామప్రభు విధానం కాదుప్రజలు ఇబ్బంది పడుతుంటే పరిష్కారం చూపించాల్సిందే అనే సంకల్పంతో వెంటనే స్పందించి, మోరం తీసుకువచ్చి రోడ్లపై వేయించి, రోడ్లను చదును చేయించే చర్యలు చేపట్టారు.ఇది ఒక చిన్న సమస్యకు చేసిన తాత్కాలిక సహాయం మాత్రమే కాదు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను చేతల్లో చూపించిన నాయకత్వానికి నిదర్శనం. ప్రజలసమస్యలపై ప్రశ్నించడంలోనూ
ప్రజల కోసం ముందుకు రావడంలోను
అవసరమైన చోట చొరవ తీసుకోవడంలో
రామప్రభు ఎప్పుడూ ముందుంటారు.
పదవుల కోసం ప్రజల వద్దకు వెళ్లే నాయకత్వం కాదుప్రజల కోసం అవసరమైనప్పుడు ముందుకు వచ్చే నాయకత్వం ప్రజల సమస్య కనిపిస్తే స్పందన కాదు పరిష్కారం కావాలి.మాట ఇచ్చిన చోట ఆగరు పని పూర్తయ్యే వరకు ముందుకు సాగుతారు అని స్థానికులు ఆయన విశిష్ట సేవలను కొనియాడారు.